గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మహిళా వాలంటీర్ కాళ్లు కడిగారు. మంగళగిరి నియోజకవర్గ పరిధి దుగ్గిరాల మండలం ఈమని లో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్కే.. ఈమని సచివాలయం - 2 పరిధి వాలంటీర్ జెట్టి రజిత పాదాలను కడిగి నమస్కరించారు.. శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. వాలంటరీ వ్యవస్థ ప్రజలందరికి ఎంతో ఉపయోగపడుతుందని.. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను కొనియాడుతూ విశేష సేవలు అందించిన వాలంటీర్ జెట్టి రజితను ఘనంగా సత్కరించడంతో పాటు ఆమె పాదాలను కడిగి నమస్కరించానన్నారు.
ఏలూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల జనసేనానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పి.. ఈ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa