రోడ్ల పరిస్థితిపై ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. రోడ్డుపై మంచం వేసుకుని పడుకున్నాడు. రోడ్డుపై నీళ్లు నిలిచి ఉన్న గుంతలో నవారు మంచం వేసుకుని పడుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గంటసేపు ఆగిపోయింది. తర్వాత ఆర్టీసీ డ్రైవర్, స్థానికులు నచ్చచెప్పడంతో యువకుడు వెనక్కి తగ్గాడు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని లేదా నూతన రోడ్డు నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే అందరికీ తెలిసేందుకు ఇలా చేసినట్లు యవకుడు చెబుతున్నాడు. ఈ వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రోడ్ల దుస్థితిపై ఓ యువకుడు వినూత్న నిరసన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా రోడ్డును బాగు చేయించకపోవడంతో ఆగ్రహం చెందిన ఓ యువకుడు.. వెరైటీగా ఆందోళన చేశాడు. ఏలూరు టౌన్ నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిల్హౌస్పేట వద్ద యువకుడు మంచంను రోడ్డుపై వేసుకుని పడుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆర్టీసీ బస్సు యువకుడు నిరసన తెలియజేస్తున్న మార్గం వైపు వచ్చింది. అయినా యువకుడు మంచం తీయకుండా అలాగే పడుకున్నాడు.
బస్సు డ్రైవర్, స్థానికులు యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు తర్వాత యువకుడు మంచం తీసివేయడంతో బస్సు ముందుకు కదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో రోడ్డుపై భారీ గుంత ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో అందులో వర్షపునీరు నిలిచి ఉన్నాయి. ఆ మట్టి నీళ్లల్లోనే యువకుడు మంచం వేసుకుని పడుకున్నాడు.
రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉండటం వల్ల ఈ గతుకుల రోడ్డులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉందని యువకుడు చెబుతున్నాడు. అనేకసార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు మొర పెట్టుకున్నామని, అయినా పట్టించుకోలేదని తెలిపాడు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా నిరసన చేపట్టాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి అధికారులు స్పందిస్తారో.. లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa