ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే పోటీ,,,,నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 07:08 PM

వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్(పీఏసీ) నాదెండ్ల మనోహర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ రోజురోజుకి పుంజుకుంటుందని తెలిపారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని గత కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో మనోహర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.


ఇవాళ గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. జగన్ పేషీలోని ఫైల్స్‌కే రక్షణ లేకుండా పోయిందని, అలాంటిది వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల సమాచారానికి భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని కూడా వాలంటీర్లు సేకరిస్తున్నారని, ఆ సమాచారాన్ని ఎక్కడికి పంపిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం ప్రైవేట్ వ్యక్తులు, ఏజెన్సీలకు చేరుతుందని ఆరోపించారు.


జగన్ ప్రమేయం లేకుండా ఆయన పేషీలోని 225 ఫైల్స్ మీద డిజిటల్ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని మనోహర్ ఆరోపించారు. సీఎం సంతకానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. బయటకు లీకైన ఫైల్స్‌లో అత్యంత కీలక అంశాలు ఉన్నాయని, ఇంత పెద్ద విషయం జరిగినా సీఎంఓ స్పందించకపోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందో బయటకు ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. సీఎం సంతకం ఎవరు ఫోర్జరీ చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa