అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణమైన ఘటన జరిగింది. పుంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీ సమీపంలో డ్రైవర్స్ కాలనీకి చెందిన అల్తాఫ్పై ముగ్గురు యువకులు బైక్పై వచ్చి పట్టపగలే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల జిల్లాలో ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. కురబలకోట మండలం పూజారివాండ్లపల్లెలో జూన్ 6న మాజీ ఆర్మీ ఉద్యోగి శ్రీధర్ ఇంట్లో నిద్రిస్తుండగా అతడి భార్య మమత పెట్రోలు పోసి నిప్పంటించింది. ఉద్యోగ విరమణ తర్వాత దక్కే ప్రయోజనాలు, ఎల్ఐసీ డబ్బులు కాజేసేందుకు సొంత భర్తపైనే ఇలా పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మమత జైలుకు వెళ్లగా పిల్లలు అనాథలయ్యారు. ఇప్పుడు అల్తాఫ్పైనా ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలంరేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa