సీఎం జగన్ పై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతిని ధ్వంసం చేసినట్లే పోలవరంను జగన్ నాశనం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్నారని.. ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారన్నారు. మా హయాంలో పూర్తిచేస్తాం అని చెప్పిన జగన్ ఇప్పుడు 2025కు పోలవరం పూర్తి చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. నిర్వాసితులను నీళ్లలో ముంచి ఈరోజు మాట మారుస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి కాదని స్పష్టం చేశారు. 23న ఏలూరులో పోలవరంపై నిరసన చేపడతామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa