అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముకుందపురం సమీపంలో మరోసారి భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. స్థానికంగా వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు 15 అడుగులకు పైగా ఉన్న కింగ్ కోబ్రా కనిపించడంతో భయంతో వణికిపోయారు.. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు మూర్తి బృందం అక్కడికి చేరుకుంది. గిరి నాగును పట్టుకునే ప్రయత్నంలో కాస్త ఇబ్బందిపడ్డారు.
ఈ కింగ్ కోబ్రా సాధారణం కంటే పొడవుగా ఉండడంతో పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గిరి నాగును ఎదురు తిరుగుతూ బుసలు కొట్టింది. గంటపాటూ తీవ్రంగా శ్రమించి ఓ సంచిలో కింగ్ కోబ్రాను బంధించారు. పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ కింగ్ కోబ్రా అతి విషపూరితం అంటున్నారు. ఈ కింగ్ కోబ్రా పొడవు దాదాపుగా 15 అడుగుల వరకు ఉందని.. బరువు 13 కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గిరి నాగును చూడడం ఇదే తొలిసారి అని స్థానికులు అంటున్నారు.
జతకట్టే సీజన్ కావడంతో తరచూ గిరి నాగులు బయటకు వచ్చేస్తున్నాయని చోడవరం ఫారెస్ట్ రేంజర్ రవి వర్మ చెబుతున్నారు. చూడటానికి భారీగా ఉన్న ఈ గిరి నాగును పట్టుకోవడంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతోనే ఇలా కింగ్ కోబ్రాలు వస్తుంటాయని స్థానికులు అంటున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కాలంలో కనిపిస్తున్నాయి. ఆ సమీప కొండలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాడుగుల, దేవరపల్లి, చీడికాడ మండలాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa