ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఒంగోలులో పర్యటించనున్న పురందేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 05:54 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈనెల 10న ఒంగోలు జిల్లాకు రానున్నారు. రాష్ట్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సర్పంచ్‌లు చేపట్టిన ఆందోళనలో పాల్గొననున్నారు. కేంద్రం వివిధ రూపాల్లో ఇస్తున్న నిధులను ఎటువంటి తీర్మానాలు లేకుండా రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించి పంచాయతీలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న దని సర్పంచ్‌లు ఆగ్రహంతో ఉన్నారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి తొలిగా ఈ అంశంపై దృష్టిసారించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకు అండగా నిలిచి వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆందోళ నలకు పార్టీ పరంగా శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో ఈనెల 10న కలెక్టరేట్‌ వద్ద సర్పంచ్‌లు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు పురందేశ్వరి వస్తున్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ జిల్లా నేతలు, దగ్గుబాటి కుటుంబ అభిమానులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa