దేశవ్యాప్తంగా రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా పరియోజన ప్రాజెక్టు చేపట్టింది. అయితే భారత్ మాలా పరియోజనలోని ఫేజ్ 1 ప్రాజెక్టు కింద చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ నిర్మాణ వ్యయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముందు ఆమోదించిన దాని కంటే ఏకంగా 14 రెట్లు వ్యయం పెరిగినట్లు తాజాగా వెల్లడైంది. ఒక్కో కిలోమీటర్ రోడ్డు వేసేందుకు మొదట రూ. 18.20 కోట్ల వ్యయానికి ఆమోదం తెలపగా.. ఖర్చు అయింది మాత్రం కిలోమీటర్కు రూ. 250.77 కోట్లు అని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ తేల్చింది.
భారత్ మాలా పరియోజన ఫేజ్-1 ప్రాజెక్టు కింద ఢిల్లీ - గురుగ్రామ్ మధ్య నేషనల్ హైవే-48 పై ద్వారకా ఎక్స్ప్రెస్ నిర్మాణానికి 2017 లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ - గురుగ్రామ్ మధ్య రహదారిపై రద్దీ తగ్గించేందుకు 14 లైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే మొదట ఆమోదం తెలిపిన లెక్కల ప్రకారం ఈ ద్వారకా ఎక్స్ప్రెస్లో భాగంగా కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ. 18.20 కోట్లు అని అంచనా వేశారు. వాస్తవంగా రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో కిలోమీటర్కు రూ.250.77 కోట్లు ఖర్చయినట్లు తెలిసింది. అయితే ఈ లెక్కలను ఆడిటింగ్ విభాగం కాగ్ వెల్లడించింది.
అయితే ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇచ్చిన వివరణను కూడా కాగ్ ప్రస్తావించింది. ద్వారకా ఎక్స్ప్రెస్ వే ను అతి తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో 8 రోడ్ల నిర్మాణంగా విస్తరించాలని మొదట నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ట్రాఫిక్ లేకుండా వేగంగా వెళ్లేందుకు వీలుగా తర్వాత లైన్ల సంఖ్య పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయమే ద్వారకా ఎక్స్ప్రెస్ నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమైందని పేర్కొన్నట్లు తెలిపింది. రోజువారీగా 55,432 ప్యాసింజర్ వాహనాలు ప్రయాణిస్తాయనే లెక్కతో నిర్మించిన 8 లైన్ల నిర్మాణానికి ప్లానింగ్ లేదని పేర్కొంది. ఇది ఒక్కటి మాత్రమే కాదని.. దేశ వ్యాప్తంగా భారత్మాలా పరియోజన కింద నిర్మించిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ఆమోదం పొందిన వ్యయం కంటే 58 శాతం అధికంగా ఖర్చయ్యాయని కాగ్ వెల్లడించింది. దీంతోపాటు ప్రాజెక్టుల్లో మొదట నిర్ణయించిన దానికంటే తర్వాత మార్పులు చోటు చేసుకోవం కూడా నిర్మాణ ఖర్చు పెరగడానికి కారణం అయిందని కాగ్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa