దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మునిసిపల్ మాజీ చైర్మన్ జక్కం అమ్మాణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఈనెల 19న రాధాకృష్ణ, పుష్పవల్లి నిశ్చితార్థం, సెప్టెంబరు 6న విజయవాడలో వివాహం చేయాలని నిర్ణయించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఈ నెల 28 తర్వాత మరో ముహూర్తం నిర్ణయించనున్నట్లు వధువు తండ్రి బాబ్జి తెలిపారు. కాగా, పుష్పవల్లి తల్లిదండ్రులు బాబ్జి, అమ్మాణి టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అమ్మాణి గతంలో మునిసిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ జనసేన గూటికి వెళ్లారు. ఇటు కాపు సంఘంలోనూ చురుగ్గా పని చేస్తున్నారు. ఇటీవల నరసాపురం పర్యటనలో పవన్కల్యాణ్ రెండు రోజులు జక్కం బాబ్జీ నివాసంలోనే బసచేశారు. ఇక, రాధాకృష్ణ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంపాటు వైసీపీలో ఉన్నారు. తర్వాత దాన్ని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల దూరంగా తటస్థంగా ఉంటున్నారు. రాధకు కాబోయే భార్య పుష్పవల్లి ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో ఒక విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa