శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కొండచిలువ కలకలంరేపింది. ఓ చికెన్ షాపులోకి కొండచిలువ దూరింది.. పుట్టపర్తి మండల పరిధిలోని ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. వెనుక ఉన్న కొండలో నుంచి ఆదివారం రాత్రి కొండ చిలువ చికెన్ సెంటరులోకి ప్రవేశించింది. నాలుగు బ్రాయిలర్ కోళ్లను తినేసిన తర్వాత నీటి డ్రమ్ములో ఉంది.
సోమవారం ఉదయం ముక్తార్ నీటి కోసం డ్రమ్ము వద్దకు వెళ్లాడు.. అక్కడ కొండ చిలువ కన్పించింది. దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంది. ముక్తార్ కొండచిలువను చూసి వణికిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు కూడా భయంతో పరుగులు తీశారు. చివరకు పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఆ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందనే అందరూ చర్చించుకున్నారు.
జిల్లాలోని పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో 44వ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని సెక్యూరిటీగార్డ్ వడ్డె చల్లా వెంకటేశ చనిపోయాడు. రాప్తాడు మండలం హంపా పురానికి చెందిన నాగలక్ష్మమ్మ కుమారుడు వడ్డె చల్లా వెంకటేశ మూడు వారాల నుంచి కియా అనుబంధ సిస్ కంపెనీలో సెక్యూరిటీగార్డ్గా పనిచేస్తున్నాడు. అతడు గుట్టూరులో అద్దె ఇంటిలో ఉంటూ విధులు నిర్వహించేవాడు. వెంకటేశ ఆదివారం రాత్రి అమ్మవారిపల్లిలో భోజనం చేసి గుట్టూరులో కాలినడకన వెళ్తున్న సమయంలో వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంక టేశ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa