ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళంపై గల్లా జయదేవ్ వ్యాఖ్యలు,,,నారా లోకేష్‌ టార్గెట్‌గా కామెంట్ చేశారని ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 08:03 PM

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 191 రోజు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన సభలో లోకేష్ పాల్గొన్నారు.. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రకు సొంత పార్టీ ఎంపీలైన గల్లా జయదేవ్, కేశినేని నానిలు దూరంగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు పాదయాత్రలో పాల్గొనలేదు.. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇద్దరు ఎంపీలు టీడీపీని వీడతారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


తన పేరుతో సోషల్ మీడియాలో తాను చేయని వ్యాఖ్యలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయదేవ్ అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.. 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్‌లో మరియు సోషల్ మీడియ లో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను' అన్నారు ఎంపీ గల్లా జయదేవ్


'యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదని.. ఈ పాదయాత్ర వల్ల ఒరింగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటని.. పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తిస్తున్నారని.. పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే అన్నారు. ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. నారా లోకేష్‌ను ఏపీ ప్రజు నమ్మడం లేదని.. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదు.. టీడీపీ హైకమాండ్ ఇకనైనా పునరాలోచన చేయాలి' అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచార జరుగుతోంది.


నారా లోకేష్ పాదయాత్ర గతవారం నుంచి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జరిగింది. అయితే గుంటూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన పాదయాత్రకు ఎంపీ గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు. దీంతో ఎంపీ యువగళంలో ఎందుకు పాల్గొనలేదనే చర్చ జరుగుతోంది. ఇటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాదయాత్రకు వెళ్లలేదు.. హైదరాబాద్‌లో ఉన్న ఆయన విజయవాడలో పాదయాత్ర జరిగిన సమయంలో అటువైపే వెళ్లలేదు. నాని కుమార్తె శ్వేత కూడా యువగళంకు హాజరుకాలేదని చెబుతున్నారు. ఇద్దరు ఎంపీలు పాదయాత్రకు వెళ్లకపోవడంతో పార్టీ మారతారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జయదేవ్ యువగళంపై కామెంట్స్ చేశారంటూ కొన్ని ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa