రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరుపు నుండి టికెట్ ఎవరికిచ్చినా అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని ఆ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుంతకల్లు నియోజకవర్గ పార్టీ ముఖ్యనాయకులు, పట్టణ అధ్యక్షులు, మండల కన్వీనర్లతో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత వనటూవన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. పొలిట్ బ్యూరో సభ్యులు నిర్వహించిన వనటూవన కార్యక్రమంలో టికెట్ ఎవరికిచ్చినా అభ్యర్థి విజయం కోసం పనిచేస్తామనే ఏకాభిప్రాయాన్ని ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ వివరాల నివేదికను పొలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబుకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరో మారు నియోజకవర్గం ముఖ్యులు, పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జిలతో సమావేశం కానునున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa