టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఓటర్ల జాబితా సవరణ ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు?, అర్హులు ఓటు హక్కు వినియోగించుకునేలా దొంగ ఓట్లు నమోదు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరితే వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేమిటి?, మంత్రులు సహా విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్ల నమోదుతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదనడం హాస్యాస్పదం. ప్రతి నియోజకవర్గంలో 7 నుంచి 10 వేల ఓట్లు వరకు తీసేయాలని అధికారులకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది వాస్తవం కాదా?, 2019 జనవరి నుంచి మార్చి నాటికి 25 లక్షల దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయో.. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ, జగన్ రెడ్డికే తెలుసు.’’ అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa