ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:18 PM

బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 1,355వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  వారు మాట్టాడుతూ....  అమరావతి రాజధానిపై గిట్టని వారు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ, ఆర్‌ -5జోన్‌ పేరుతో మాస్టర్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని మూడు ముక్కలు చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తే రాష్ట్రానికి సిరులు కురిసేవన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa