తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి) ట్రస్ట్కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, మతమార్పిడులను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం టీటీడీ ఈ ట్రస్ట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రస్ట్ ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలోనే భక్తుల విరాళాలు వెయ్యి కోట్లుకు చేరుకున్నాయి.
2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్టు ప్రారంభం కాగా.. 2019 అక్టోబర్ నుంచి భక్తులుకు అందుభాటులోకి వచ్చింది. 2019లో 19,737 మంది భక్తుల నుంచి 26.25 కోట్లు విరాళంగా అందింది. ఆ తర్వాత ఏడాది 2020లో 49,282 మంది భక్తుల నుంచి 70.21 కోట్లు, 2021లో లక్షా 31 వేల మంది భక్తుల నుంచి రూ.176 కోట్లు విరాళంగా అందాయి. 2022లో రెండు లక్షలా 70 వేల మంది భక్తుల నుంచి 282.64 కోట్లు విరాళంగా అందాయి. ఇక 2023లో ఇప్పటి వరకు లక్షా 58 వేల మంది భక్తుల నుంచి రూ.268.35 కోట్లు విరాళంగా అందినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్ట్కి ఇప్పటి వరకు రూ.970 కోట్లు విరాళాల రూపంలో రాగా.. వడ్డీ రుపేణా రూ.36 కోట్లు ఆదాయం సమకూరింది. దీంతో మెుత్తం రూ. వెయ్యి కోట్లు దాటింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో టీటీడీ 176 పురాతన ఆలయాల పునఃరుద్దరణ పనులు ప్రారంభించింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ కాలనీలో 2,273 నూతన ఆలయాల నిర్మాణాలు కూడా ప్రారంభించింది. 501 ఆలయాలకు ధూపధీప నైవేధ్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున టీటీడీ చెల్లిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa