వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ఎంగేజ్మెంట్ జరిగింది. నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీ దంపతుల రెండో కుమారుడు జక్కం పుష్పవల్లితో రాధాకు నిశ్చితార్థం జరిగింది. అమ్మాయి ఇంటి వద్ద ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించారు. ఆగస్టు 19నే ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ 3న నిశ్చితార్థం నిర్వహించారు. వంగవీటి రాధా నిశ్చితార్థానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి దంపతుల వివాహం అక్టోబర్ 22న జరగనుంది. రాధా కాబోయే భార్య పుష్పవల్లి నర్సాపురం, హైదరాబాద్లలో చదువుకున్నారు. ఆమె యోగా టీచర్గా పని చేశారని సమాచారం. జక్కం బాబ్జీ ఇప్పుడు జనసేనలో ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నర్సాపురం వెళ్లిన సందర్భంగా బాబ్జీ ఇంటికెళ్లారు. వంగవీటి రాధా 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఓటమిపాలయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రాధా.. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa