దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లను జంక్షన్లుగా మార్చారు. నూతన రైలు మార్గాలు నిర్మించడంతో ఐదు రైల్వే స్టేషన్లను జంక్షన్లుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్లు చివరన జంక్షన్ అని అదనంగా చేరుతుంది. మరోవైపు సికింద్రాబాద్-రామనాథపురం -సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 6 నుంచి 27 వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్లో 21.10 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07695) సత్తెనపల్లి 00.44, గుంటూరు 01.50, తెనాలి 02.35, రామనాథపురం 23.45 గంటలకు చేరుతుంది.
ఈ రైలు (07696) తిరుగు ప్రయాణంలో ఈనెల 8 నుంచి 29వ తేదీ వరకు ప్రతి శుక్రవారం రామనాథపురంలో 09.50 గంటలకు ప్రారంభమై తెనాలి 04.33, గుంటూరు 05.10, సత్తెనపల్లి 05.54, సికింద్రాబాద్ 12.50 గంటలకు వెళ్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నిత్యం సికింద్రాబాద్ - గుంటూరు - సికింద్రాబాద్, చెన్నై సెంట్రల్ - విజయవాడ - చెన్నై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఇంటర్సిటీ, జనశతాబ్ధి ఎక్స్ప్రెస్లను కలిపేసి ఒక రైలుగా నడపాలని గుంటూరు రైల్వే డివిజన్ ప్రతిపాదించింది. అటు సికింద్రాబాద్, ఇటు చెన్నై సెంట్రల్కి రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రెండు రైళ్లు కలిపేసి సికింద్రాబాద్ - చెన్నై సెంట్రల్ ఇంటర్సిటీగా వయా న్యూగుంటూరు నడిపేందుకు రైల్వేశాఖ ప్రతిపాదించింది.
విశాఖపట్టణం - విజయవాడ మధ్యన రాకపోకలు సాగిస్తున్న ఉదయ్ ఎక్స్ప్రెస్ని గుంటూరు వరకు పొడిగిస్తూ రైల్వేబోర్డు ఎప్పుడో ఆమోదం తెలిపింది. అయినా ప్రారంభోత్సవం కోసం ఆ రైలుని నేటికీ గుంటూరు వరకు పొడిగించలేదు. మరోవైపు విశాఖపట్టణం - సికింద్రాబాద్ వందేభారత్, ఉదయ్ ఎక్స్ప్రెస్లు ఇంచుమించు 20 నిమిషాల వ్యవధిలోనే బయలుదేరుతున్నాయి. దీని వలన వందేభారత్ ఆక్యుపెన్సీ మీద ప్రభావం పడుతుండటంతో ఉదయ్ ఎక్స్ప్రెస్ని రద్దు చేయాల్సిందిగా అక్కడి డివిజన్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
మరోవైపు సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. రైలు నెంబర్ 07071 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) సెప్టెంబర్ 2న సికింద్రాబాద్ నుంచి రాత్రి 9:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు కాకినాడ టౌన్ వెళుతుంది. చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు (07072 ) తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 03న కాకినాడ టౌన్ నుంచి రాత్రి 9 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa