మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జెల ఉదయ్కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఈ ఇద్దరి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు.. వీటిని కొట్టివేసింది. ప్రస్తుతం వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ వాదనలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ఏడాది ఏప్రిల్లో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు కుట్రదారుల్లో భాస్కర్ రెడ్డి ఉన్నట్టు సీబీఐ తెలిపింది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కుట్ర, హత్య, ఆధారాలను మాయం చేసినట్టు కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టి వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన సీబీఐ కోర్టు.. సునీత, సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని భాస్కర్ రెడ్డి తరఫు లాయర్కి న్యాయస్థానం స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డిది కీలక పాత్రని.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ను తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa