ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకలు అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. అక్టోబరు 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి ఆ తర్వాత బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
అక్టోబరు 20న మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనానికి తెల్లవారుజూమున 2 నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లో వచ్చిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాధారణంగా దసరా మొదటి రోజున స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు ఈసారి బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. 23న విజయదశమిని పురస్కరించుకొని ఉదయం 10.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తుల తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు
అక్టోబరు 15న బాలా త్రిపురసుందరీదేవి, 16న గాయత్రీదేవి, 17న అన్నపూర్ణాదేవి, 18న మహాలక్ష్మీదేవి, 19న లలితా త్రిపురసుందరీదేవి, 20న సరస్వతీదేవి, 21న దుర్గాదేవి, 22న మహిషాసురమర్దిని, 23న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa