రైలులో మహిళ పర్సు కొట్టేసిన దొంగ.. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడ్ని గుర్తించిన ప్రయాణికులు.. కిటికీలో నుంచి పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్ల వరకూ దొంగ అలాగే వేలాడుతూ ఉండిపోయాడు. చివరకు ఓ జంక్షన్ వద్ద పోలీసులకు అప్పగించారు. బిహార్లోని బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం కటిహార్ నుంచి సమస్తిపుర్ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది.
కిటికీలో నుంచి పర్సును తీసుకున్న దొంగ... తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకబోతుండగా తోటి ప్రయాణికులు గమనించారు. దీంతో దొంగ చేతులను కిటికీ లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు. అతడికి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాడు. చివరకు రైలు బచ్వారా జంక్షనుకు చేరుకున్న తర్వాత ఆర్పీఎఫ్ పోలీసులకు అతణ్ని అప్పగించారు. ఆ దొంగను హేమంత్ కుమార్గా గుర్తించిన పోలీసులు.. అతడి వివరాలను తీసుకుని విడిచిపెట్టారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతంలోనూ ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. రైలులో మొబైల్ ఫోన్ను చోరీ చేసి పారిపోతున్న దొంగను ప్రయాణికులు పట్టుకుని కిటికీ కట్టేశారు. ఈ ఘటన కూడా బిహార్లోనే చోటుచేసుకుంది. సాహెబహ్పూర్ కమల్ నుంచి ఖగారియా వైపు వెళ్తున్న రైలులో ప్రయాణికులు దొంగను కిటికీకి వేలాడదీయగా... సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa