ఉత్తర, తూర్పు బంగాళాఖాతం ఉపరితలంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం సోమవారం ఉత్తర, పశ్చిమ దిశకు మరింత చేరువైంది. సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఈ అవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారనున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారుతాయని చెప్పింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళవారం పల్నాడు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం,అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వానలు దంచి కొడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 10 సెం.మీ.వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 8 సెం.మీ., బాపట్ల జిల్లా అద్దంకి), నంద్యాల జిల్లా ఆత్మకూరు, డోన్లో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, వైయస్సార్, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa