ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర స్థాయిలో విజేతగా నిలిచిన విజయవాడ రైల్వే స్టేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 02:57 PM

దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిసారి ప్లాటినం రేటింగ్‌ సాధిస్తున్న సికింద్రాబాద్‌తో పోటీపడుతూ ఈసారి ఎనర్జీ ఎఫిషియన్సీ-గ్రీన్‌ ఇనిషేటియేటివ్స్‌లో భాగంగా బెజవాడ ఏ1 స్టేషన్‌ ప్లాటినం అవార్డును సాధించింది. ప్రతి మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) అవార్డులను 2023లో సెప్టెంబరు 5వ తేదీన ప్రకటించారు. మొత్తం ఆరు అంశాలలో ప్రధానంగా ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. సమర్థవంతమైనస్టేషన్‌, పరిశుభ్రత, ఆరోగ్యం, ఇంధన సామర్థ్యం, వాటర్‌ ఎఫిషియన్సీ, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ ఇనిషియేటివ్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అంశాలపై ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. ఈ ఆరు ఆంశాల్లోనూ విజయవాడ స్టేషన్‌ నూరుశాతం మెరుగైన ఫలితాలను సాధించి ప్లాటినం అవార్డుకు ఎంపికైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa