ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆపండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 03:01 PM

వైసీపీ నేతలు పేర్ని నాని, అతని కొడుకు కలిసి మచిలీపట్నంలో కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని జనసేన నేత కొరియర్ శ్రీను అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జనసేనను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేని పేర్ని నాని కుట్రలకు పాల్పడుతున్నాడు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజలు కొట్టుకోవాలని పేర్నినాని బ్యానర్లు కట్టించారు. మీ మాయలో పడి మోసపోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. నీ కొడుకు కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిగ్గుండాలి. నానీ..నీ కొడుకు చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. నీ కుల రాజకీయాలకు ప్రజలే బుద్ది చెబుతారు అని కొరియర్ శ్రీను పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa