అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. ఆ తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. ఆయన పాద సేవలో తరించేందుకు తనవంతు కానుక అందించారు. దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు పుష్పాలను స్వామి వారికి బహూకరించారు. తిరుమల శ్రీవారికి ఖరీదైన ఆభరణాన్ని కానుకగా అందజేశారు కడపకి చెందిన డాక్టర్ రాజీవ్ రెడ్డి. టీటీడీకి రూ.రెండు కోట్ల విలువ చేసే బంగారు తామర పుష్పాలను విరాళంగా ఇచ్చారు. శ్రీవారి అష్టదళ పాద పద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు తామర పుష్పాలను లలితా జ్యువెలర్స్లో ప్రత్యేకంగా తయారు చేయించారు.
దాత రాజీవ్ రెడ్డి లలితా అధినేత కిరణ్ కుమార్తో కలిసి తిరుమలకి చేరుకొని.. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. బంగారు పుష్పాలను అర్చకులచే స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందిన అనంతరం రంగనాయకుల మండపంలో.. మొత్తం 108 బంగారు తామర పుష్పాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ పుష్పాలను శ్రీవారి అష్టదళ పాద పద్మారాధన సేవలో అలంకరించనున్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు డబ్బులు, బంగారాన్ని హుండీలో వేస్తే.. మరికొందరు టీటీడీ ట్రస్టులతో పాటూ స్వామివారికి కానుకగా ఇస్తుంటారు. ఇలా కొందరు భక్తులు స్వామివారికి వెండి, బంగారు ఆభరణాలు చేయిస్తుంటారు. మరికొందరు బైకులు, కార్లు, ఇతర వాహనాలను కూడా అందజేస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa