ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పాలనే ప్రజలకి మీలు చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:42 PM

రాష్ట్రాభివృద్ది జరగాలంటే అది చంద్రబాబుకే సాధ్యమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని అద్దంకివారిలంక, పల్లపులంక, కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో నిర్వహించిన భవిష్యత్‌కు బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు బాబు గ్యారంటీ, మహాశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 8సార్లు కరెంటు బిల్లులు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ కుటుంబానికి చేకూరే లబ్ధిని వివరిస్తూ ఆయా గ్రామాల్లో భవిష్యత్‌కు గ్యారంటీ హామీ పత్రాలను మహిళలు, నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు ముత్యాల వెంకట్రావు, పువ్వల చిట్టిబాబు, రంకిరెడ్డి వెంకటేశ్వరరావు, రమేష్‌, వీధి ప్రసాద్‌, రవి, గాలిదేవర వసంతరాయుడు, రామారావు, రామకృష్ణ, విత్తనాల వాణిశ్రీదేవి, షేక్‌వలీజాని, వి.ఇందిరా రాణి, ఎస్‌ కృష్ణవేణి, ఎన్‌. కనకవల్లి, పి.మంజుల, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa