ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని దోచుకుంటున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:43 PM

రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 8న తిరుపతిలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీ మాలకొండయ్య కోరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పేదప్రజలపై అధికభారాలు మోపుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తిరుపతి సభలో జాతీయ నాయకులు కె. రాజా, బినయ్‌విశ్వం, కె. నారాయణలతోపాటు రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు బీ.సురేష్‌బాబు, షేక్‌ హుస్సేన్‌, కే మురళి, నత్తా రామారావు, డీ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa