ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీకల్లు తాగి అస్వస్థతకి గురైన పలువురు కూలీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:01 PM

అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని నాగలూరు, బండపల్లికి చెందిన 14 మంది కూలీలు కల్తీకల్లు తాగి, గురువారం అస్వస్థతకు లోనయ్యారు. పెనుకొండలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని, వెళ్లిపోయారు. గురువారం కూడా వాంతులు, విరేచనాలు అధికం కావడంతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. కల్తీ కల్లు తాగడమే ఇందుకు కారణమని వైద్యులు నిర్ధారించారు. అస్వస్థతకు లోనైన వారిలో నాలగూరు గ్రామ కూలీలు సిద్దప్ప, కదిరప్ప, సంజీవమ్మ, కొల్లమ్మ, గంగమ్మ, అంజినప్ప, ఆంజనేయులు, కళావతి, బావక్క, మైనర్‌ బాలిక పుష్పలత, బండపల్లికి చెందిన ఫక్కీరప్ప, ముత్యాలక్క, సరోజ, నబీ, గంగరాజు, కళావతి, జయమ్మ, లక్ష్మమ్మ మరికొందరు ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa