ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాళాలు పగలకొట్టి దొంగతనం చేసిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 01:02 PM

కృష్ణా జిల్లా, కూచిపూడి పరిధిలోని పెదపూడిలో పట్టపగలు చోరీ జరిగింది. పెదపూడి గ్రామానికి చెందిన బుగ్గా సత్యనారాయణ, అతని భార్యను వైద్యం కోసం ఉదయం 10 గంటల సమయంలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి 1.45 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉంచిన 30 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరించుకుని పోయారు. ఇంట్లో వెండి వస్తువులు ఉన్నప్పటికీ వాటిని అలాగే వదిలేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa