ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన సమస్య తీర్చాలని,,,ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన నటుడు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 08:48 PM

ప్రముఖ కన్నడ నటుడు, టీవీ రియాలిటీ షో జడ్జ్ ప్రేమ్ నెనపిరాలి.. ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్నేళ్లుగా కావేరీ నదీ జలాలా పంపకంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. అయితే ఇటీవల ఈ ఆందోళనలు తీవ్రమై రెండు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు పోటాపోటీగా బంద్‌లు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించాలని ప్రేమ్ నెనపిరాలి ప్రధానికి వినూత్నంగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.


సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కావేరీ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తమిళనాడుకు వాటాగా నీళ్లను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అటు కర్ణాటకలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల బెంగళూరు బంద్‌కు కూడా కన్నడ ప్రజలు పిలుపునిచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కావేరీ జలాల విషయంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసనలు, ఆందోళనల వలన కావేరీ నదీ జలాల సమస్య పరిష్కారం కాదని.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలే కూర్చొని మాట్లాడి ఈ సమస్యపై ఒక నిర్ణయానికి రావాలని అంతా కోరుతున్నారు.


ఈ క్రమంలోనే ప్రముఖ కన్నడ నటుడు ప్రేమ్‌ నెనపిరాలి ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాయడం.. సంచలనంగా మారింది.


కర్ణాటకకు, కావేరీ నదికి న్యాయం చేయండి.. కావేరీ నది మాది అని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే ఈ రక్తంతో రాసిన లేఖను సోషల్ మీడియాలో ఉంచడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలకుపైగా వ్యూస్‌, లైక్స్‌, షేర్స్ అవుతున్నాయి. ప్రేమ్ నెనపిరాలి రక్తంతో రాసిన ఆ లేఖపై నెటిజన్లు స్పందించారు. కావేరీ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుంటేనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. లేకపోతే ఎన్ని ఏళ్లయినా.. ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్‌ కోసం హీరో సిద్దార్థ్‌ బెంగళూరు వెళ్లగా.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను కావేరీ నదీ జలాల వివాదంపై ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడినుంచి వెళ్లిపోమని హెచ్చరించారు. దీంతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ మధ్యలోనే వదిలేసి సిద్ధార్థ్ వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన హీరో శివరాజ్‌కుమార్‌.. హీరో సిద్ధార్థ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa