ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ధిక ఉగ్రవాది ఎవరో వైసీపీ నాయకులూ ఆలోచించి మాట్లాడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 03:50 PM

టీడీపీ అధినేత చంద్రబాబు  ఆర్ధిక ఉగ్రవాదని పదే పదే  వైసీపీ నేతలు చెబుతున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డే ఆర్ధిక ఉగ్రవాదని సీబీఐ చెబుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.....  సీబీఐ సాక్షి పేపర్లపై రెండు ఛార్జి షీట్లు పెట్టిందని, అందులో ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డి ఉన్నారని, సాక్షికి రూ.1256 కోట్ల పెట్టుబడులు 2004, 05, 06లో వచ్చాయని, కంపెనీ పెట్టిన 6 నెలల నుంచి పేపర్ రాకుండా, ఛానల్ లేకుండా రూ.10 విలువ చేసే షేర్ రూ.350కి విక్రయించారని ఆరోపించారు. 16 కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టారని, అరబిందో, పల్లవ గ్రానైట్స్ ఇలా చాలా ఉన్నాయని, దొంగ డబ్బులు.. 22 షెల్ కంపెనీలు సాక్షిలో రూ.199.7 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ చెబుతోందని ఆనం వెంకటరమణ రెడ్డి అన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇతర కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయని, ఇది సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టిన నివేదికని అన్నారు. ఇప్పుడు ఎవరు ఆర్థిక ఉగ్రవాదో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు. సాక్షిలో అక్రమంగా పెట్టిన రూ.1256 కోట్లు ప్రజల సొమ్ము కదా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు వాళ్ళ నాయకుడు గురించి తెలుసుకోవాలని, వైఎస్సార్ ఎన్నికల ఆఫీడవిట్లో రూ.2.12 కోట్లు అని చూపించారని.. 2009 ఎన్నికల్లో ఆఫీడవిట్లో జగన్ రూ.70 కోట్ల ఆస్తి ఉన్నట్లు చూపించారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రూ.90 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టారు... ఇంత సొమ్ము ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సాక్షి పేపర్ సర్క్యూలేషన్ 10,02,000... వీటిలో సచివాలయం 1.54 లక్షలు. వీటికి ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనితోపాటు వాలంటీర్, సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పేపర్ వెళ్తుంది. దీనికి ప్రజల సొమ్ము ప్రభుత్వం కడుతుంది. అంటే దాదాపు 5 లక్షల పేపర్ల కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు చెల్లిస్తుంది. దీంతో పాటు ప్రకటనల పేరుతో రూ.400 కోట్ల నుంచి, రూ.500 కోట్లు చెల్లించారని.. దీన్ని మోసం అంటారా?.. దొంగతనం అంటారా?.. లేదా వాలంటైన్ బహుమతి అంటారా? అని ప్రశ్నించారు. ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతోంది ఐఏఎస్ అధికారులు కాదని, సాక్షి పత్రికలో పని చేసిన మాజీ ఉద్యోగులు నడుపుతున్నారని, వారికి ఇచ్చే జీతం ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. సాక్షి పత్రికపై సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అసలు ఆ పార్టీ నాయకులకు దాని అర్ధం తెలుసా. అని ప్రశ్నించారు. ఎవరు గజ దొంగ, ఎవరు వైట్ కాలర్ దొంగ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa