ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి కారుపై బాంబు దాడి,,,,పెనుకొండలో కలకలంరేపిన ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 06:18 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. గడప గడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గోరంట్ల మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకుంటూ.. ర్యాలీ చేస్తున్నారు. పార్టీ శ్రేణులతో ఊరిగింపుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోల పరిస్థితులు తలెత్తాయి. బాంబు పేలకపోవడంతో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పెనుగొండ ఉలిక్కిపడింది. అటు ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టి.. ఈ హత్యాయత్నం వెనక ఎవరున్నారో తేల్చాలని ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. బాంబు దాడి చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa