ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు సింహం పిల్లల్ని దత్తత తీసుకున్న తెలుగోడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 07:38 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరి కుమార్ పాటిల్ అలియాస్ జాగ్వార్ కుమార్ ఉక్రెయిన్‌లో ఉంటున్నాడు. గతంలో యాగ్వార్ అనే జాగ్వార్, బ్లాక్ పాంథర్‌‌తో కలిసి ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో రెండు సింహం పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నాడు. అయితే తన పెంపుడు జాగ్వార్, బ్లాక్ పాంథర్‌ను రష్యాలోని జంతు సంరక్షణ సంస్థతో విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ జంతువులపై ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు రెండు సింహాలను జంతువుల రక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నాడు. రెండు సింహాల్లో ఒకటి ఆడ, మరొకటి మగది కాగా.. వాటి వయసు రెండున్నర నెలలు. ఈ రెండు పిల్లల్ని ఉక్రెయిన్‌ నుంచి కొద్ది రోజుల క్రితం రెస్క్యూ చేశారు. తణుకుకు చెందిన గిరికుమార్ 2007లో మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. చదువు తర్వాత 2014 నుంచి అక్కడే ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. యుద్ధం తర్వాత ఆస్పత్రిని మూసివేశారు.. 2020లో జాగ్వార్, బ్లాక్ పాంథర్‌ను దత్తత తీసుకున్నాడు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ సమీపంలో సింహం పిల్లలను ఒక జంతు సంరక్షణ సంస్థ గుర్తించిందని.. వీటిని తాను అక్టోబర్ 6 న దత్తత తీసుకున్నట్లు చెప్పారు. జాగ్వార్ కుమార్‌కు వన్యప్రాణుల్ని దత్తత తీసుకునేంద ఇంటర్నేషనల్ లైసెన్స్‌ ఉంది.. అలాగే వన్యప్రాణుల రక్షణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఏడాది మాత్రమే ఈ సింహం పిల్లల్ని పెంచబోతున్నారు. ఆ తర్వాత వాటిని దక్షిణాఫ్రికాకు పంపిస్తారు. జాగ్వార్ కుమార్ యుద్ధం సమయంలో ఉక్రెయిన్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉక్రెయిన్ లోని డోన్‌బాస్ సమీపంలో ఓ బంకర్‌లో ఉన్నారు. అలాగే కుమార్ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు. ఆయన తాను పెంచుకుంటున్న జంతువులు, వన్య ప్రాణులు, తాను పడే కష్టాలను వీడియోల తీస్తూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాడు.ఇప్పుడు సింహం పిల్లల్ని దత్తత తీసుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa