ఆంధ్రప్రదేశ్ కు తాను ఎందుకు కావాలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన వివరాలు విని నివ్వెరపోయామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు మళ్లీ ఆయన రావాలా?.. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకపాలనతో అందరినీ అణగదొక్కేందుకు మళ్లీ రావాలా? అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపినందుకు జగన్ కావాలా?.. లేక రూ. 10 లక్షల కోట్లు అప్పు తెచ్చినందుకు కావాలా? అని సోమిరెడ్డి నిలదీశారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలను ముంచేశారని, నాసిరకం మద్యంతో మరణ మృదంగం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 87 శాతం ప్రజలకు సీఎం జగన్ బటన్ నొక్కారో లేదో తెలీదు కానీ 100 శాతం విద్యుత్ చార్జీలు, నిత్యావసరాలు పెంచేశారని, మద్యం, ఇసుక మాఫియాలు, బడా కాంట్రాక్టర్లు, ఆదానీ, నత్వానీ లాంటి పేదలు జగన్ పక్కన ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa