ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్తు చార్జీలు పెంపును నిరసిస్తూ సంతకాల సేకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 07:32 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, ట్రావెలర్స్ బంగళా, కసాపురం రోడ్డు ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విద్యుత్తు చార్జీలు పెంపుకు వ్యతిరేకంగా ప్రజలు సంతకాలు చేశారు. ఈనెల16వ తేదీన డిఎఇ ఆఫీసు వద్ద చేపట్టనున్న నిరసనను జయప్రదం చేయాలని నాయకులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa