ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదుగురితో టీటీడీ సమన్వయ కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 08:55 PM

టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. జనసేనతో సమన్వయం కోసం టీడీపీ ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. కమిటీలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నవారు. జనసేనతో పొత్తుపై ఇప్పటికే పార్టీనేతలకు చంద్రబాబు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ ప్రధానంగా చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రభుత్వ అవినీతి, ప్రజాసమస్యలపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించేలా ఈ కమిటీ జనసేన అధినాయకత్వంతో చర్చిస్తుంది. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక సహా, క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు సమన్వయంగా పనిచేయడం లాంటి పలు కీలకాంశాలపై పనిచేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే టీడీపీతో పొత్తుపై చర్చలకు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనుంది. గతంలోనే రెండు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి.. ఈ మేరకు కమిటీని నియమించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa