అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుడి పంట పండింది. ఉమ్మడి తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతంలో ఉన్న పాయకరావుపేట సమీపంలోని పెంటకోటకు చెందిన మన్నియ్య చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల విసరగా.. చాలా బరువుగా అనిపించింది. వెంటనే మన్నియ్య తోటివారితో కలిసి వలను బలంగా లాగాడు.. వల బయటకు తీసి చూడగానే పెద్ద చేప చిక్కిందని సంతోషించారు. వలలో నుంచి చేపను బయటకు తీసి చూడగా.. అది మామూలు చేప కాదంటూ మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశారు. అతడి వలకు కచ్చిడి చేప చిక్కింది.. దీంతో మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేవు.
ఈ చేపను ఒడ్డుకు చేర్చి మార్కెట్కు తీసుకెళ్లారు. కచ్చిడి చేప విషయం తెలియడంతో.. చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఆ చేపను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ చేకు వేలం నిర్వహించగా.. 22 కిలోలను రూ.3 లక్షల 20 వేలకు కొనుగోలు చేశాడో వ్యాపారి. ఈ చేప దక్కడం, వేలంలో భారీగా ధర రావడంతో మన్నియ్య సంతోషించాడు. కచ్చిడి చేపలు కూడా చాలా అరుదుగా దొరుకుతాయని చెబుతున్నారు. డిమాండ్ను బట్టి ధర భారీగా ఉంటుంది అంటున్నారు.
ఈ చేప మాంసం చాలా రుచిగా ఉండడంతో పాటు.. ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. కచ్చిడి చేపలో మగ చేప బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ చేపల్లో పొట్ట భాగం చాలా విలువైనదంటున్నారు మత్స్యకారులు. ఈ చేపను మందులు, ఔషధాల్లో ఈ వినియోగిస్తుంటారట. సర్జరీ చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్తో తయారు చేస్తారట. ఈ చేప శరీర భాగాలను ఖరీదైన వైన్ తయారీలోనూ వినియోగిస్తారని చెబుతున్నారు.
ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్ అనే సాంకేతిక నామంతో పిలుస్తారు.. ఈ కచ్చిడి చేప కూడా ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదట.. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుందట. అంతేకాదు ఈ కచ్చిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారని మత్స్యకారులు చెబుతుననారు. ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికినట్లే అని చెప్పుకుంటారు. అందుకే ఈ చేప దొరికితే రైతుల పంట పండినట్లే.. మార్కెట్లో నిమిషాల్లోనే కొనుగోలు చేస్తారు. ఈ చేపకు కూడా పులస చేప కంటే ఎక్కువ డిమాండ్ ఉంది.. దీంతో వ్యాపారులు కూడా పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa