సీఎం జగన్ రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్ వివేకను వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..... నెల్లూరు జిల్లా, కావలిలో రోడ్డుపై అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైందన్నారు. నడిరోడ్డుపై పట్టపగలు వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ సైకో జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్గా మారిపోయిందన్నారు. సైకో జగన్ పోతేనే, ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయని, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని లోకేష్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa