మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్రూవర్గా మారిన దస్తగిరి ఎర్రగుంట్ల పోలీసుల అదుపులో ఉన్నారు. నెల రోజుల క్రితం ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ జంట వ్యవహారంలో దర్యాప్తునకు సంబంధించి ఆయన్ను పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు. యువతిని కారులో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు ఎర్రగుంటలో అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతిని కారులో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై ప్రశ్నించనున్నట్లు చెప్పారు. దస్తగిరి గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాథమిక సమచారం ప్రకారం.. ఈ నెల 1న లక్ష్మీనారాయణ అనే యువకుడిని ప్రేమించిన యువతి.. అతడితో పాటూ వెళ్లిపోయింది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువతి, లక్ష్మీనారాయణలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఇద్దరిని ఇంటికి పంపి.. ఈ నెల 13న కేసు మూసివేశారు. అయితే ఇవాళ తెల్లవారుజామున దస్తగిరి రాణివనంలోని లక్ష్మీనారాయణ ఇంటికి యువతి తండ్రితో కలిసి వెళ్లాడు.. ఆమెను కిడ్నాప్ చేసినట్లు డయల్ 100 లక్ష్మీనారాయణ కాల్ చేశాడు. దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు చెబుతున్నారు.
అంతేకాదు నాలుగు నెలల క్రితం దస్తగిరి మరో వివాదంలో చిక్కుకున్నాడు. పులివెందుల జయమ్మ కాలనీలో దస్తగిరి నివాసం ఉంటున్నాడు. అతడు అదే వీధికి చెందిన బాలుడ్ని నిర్బంధించి, చిత్రహింసలు పెట్టాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బుల విషయంలోనే ఈ వివాదం రేగినట్లు తెలుస్తోంది. అయితే తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో కూడా దస్తగిరి సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రైల్వేకోడూరులో దస్తగిరి గన్మెన్లతో కలిసి షాపుల ముందు కూర్చున్నాడు. అక్కడ షాపుల యజమానుల్ని బెదిరించినట్లు బాధితులు చెప్పారు. ఆ స్థలం తనదేనని.. ఖాళీ చేయాలని తమపై దౌర్జన్యం చేశారని చెబుతున్నారు. ఈ సీన్ మొత్తాన్ని వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ ఇప్పుడు ప్రేమ వ్యవహారంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa