స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. చంద్రబాబు విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున జైలుకు చేరుకున్నారు.
దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘జై తెలుగుదేశం.. జై జై చంద్రబాబు’ అంటూ కార్యకర్తల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, చింతమనేని ప్రభాకర్, కంభపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్థన్ సహా పలువురు చేరుకున్నారు. ఈ సందర్భంగా జైలు బయట ఆంక్షలు విధించడంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అచ్చెన్నాయుడు ఖండించారు. అంతకు ముందు కుమారుడు నారా లోకేశ్, బ్రహ్మిణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. వాళ్లు లోపలి నుంచి వచ్చిన కాసేపటికే చంద్రబాబు విడుదలయ్యారు. రాజమండ్రి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. మంగళగిరికి రాత్రి 9.30 గంటలకు కాన్వాయ్ చేరుకోంది.
కాగా, హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం సీఐడీ దాఖలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ తర్వాత మరిన్ని షరతులు విధించింది. బెయిల్ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులతో పాటు మరో ఐదింటిని చేర్చాలని సీఐడీ లంచ్ మోషన్ పిటిషన్లో కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపటి వరకూ (బుధవారం) చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేపటి వరకూ మీడియాతో మాట్లాడొద్దని కూడా ఆదేశాలు వెలువరించింది. దీంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసింది.
జైలు నుంచి విడుదల అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తన పట్ల తెలుగు ప్రజలు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కష్టంలో ఉన్నప్పుడు మీరంతా సంఘీభావం తెలిపారని, నా కోసం పూజలు, ప్రార్థనలు చేశారని.. చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లో సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఎటువంటి తప్పుచేయలేదని, చేయబోనని బాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa