జగన్ సర్కార్ లిక్కర్ అమ్మకాలపై కేంద్రానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు చేయగా.. తాజాగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తోందని.. అయితే ఈ మద్యం సేవించడం వల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. అందులో భాగంగానే హై బీపీ, హార్ట్ స్ట్రోక్స్, కోపం, స్టమక్ అప్సెట్, సిర్రోసిస్ లివర్ సంబంధిత వ్యాధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది బాధపడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది అన్నారు.
నిజానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సమాచారం తీసుకుంటుందన్నారు. అయితే తన ఫిర్యాదు ద్వారా ఒక సెంట్రల్ ఏజెన్సీని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని పంపాలని కోరినట్లు తెలియజేశారు. మద్యం పాలసీ దశాబ్దాలుగా రాష్ట్రంలో అమలైన తీరు చూస్తే.. మద్యం కంపెనీలు లిక్కర్ తయారు చేసేవి అన్నారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా కలిగినప్పుడు.. స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ ఎక్సైజ్శాఖకు ఫిర్యాదు చేసేవాళ్లమని గుర్తు చేశారు.
ఒకవేళ ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే ప్రభుత్వం ఆ కంపెనీపై చర్యలు తీసుకునేవని గుర్తు చేశారు. అంతేకాదు ఆవెంటనే ఎక్స్గ్రేషియా సైతం ప్రకటించిన రోజులు కూడా ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీని చూస్తే.. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఒకవేళ ఎవరికైనా మద్యం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. ప్రభుత్వమే మద్యం తయారు చేస్తుంది కాబట్టి.. కనీసం ప్రభుత్వంపై ఫిర్యాదు చేసే హక్కు కూడా ప్రజలు కోల్పోయారన్నారు. కేంద్రం ఏమాత్రం పాలనపై చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ఒక బృందాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆల్ ఇండియా డైరెక్టర్ జనరల్కు ఈ లేఖను పంపినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa