అతివేగంగా వచ్చిన రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు స్పాట్లో చనిపోగా.. 60 మంది గాయాల పాలయ్యారు. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారి మృత దేహాలను మార్చురీకి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
శనివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువత్తూర్ జిల్లా వానియంబాడి హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. మూలమలుపు వద్ద రెండు బస్సులు అతి వేగంతో వెళ్లగా ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 బస్సుల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సుల్లో ఇరుక్కుపోయి మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అయితే బస్సులు ప్రారంభమైనప్పటి నుంచే ఇద్దరు డ్రైవర్లు వేగంగా నడిపినట్లు అందులోని ప్రయాణికులు ఘటన తర్వాత పేర్కొన్నారు. అతి వేగంతో నడపవద్దని ప్రయాణికులు సూచించినా వినలేదని చెప్పారు. చివరికి ఎదురెదురుగా బస్సులు ఢీకొన్నట్లు వెల్లడించారు. అతివేగం, రాత్రి వేళ కావడం వల్లే ప్రమాద స్థాయి భారీగా పెరిగిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa