ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కుగణనకు శ్రీకారం,,,,నేటి నుంచి రెండు రోజులు,,,,ఐదుచోట్ల పైలట్ ప్రాజెక్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 06:24 PM

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ప్రయోగాత్మకంగా తొలుత ఐదు గ్రామ/వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతామన్నారు. ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరిస్తామన్నారు. అలాగే బుధ, గురువారాల్లో అన్ని కలెక్టరేట్లలో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు విద్యావంతులు దీనిపై తమ సూచనలు, సలహాలను తెలియజేయవచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణసలో కులగణన జరుగుతుందన్నారు. ఈ నెల 17న రాజమహేంద్రవరం, కర్నూలు, 20న విజయవాడ, విశాఖపట్నం, 24న తిరుపతిలో కుల గణనపై ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. బిహార్‌లో కులగణన చేశారని, అధ్యయనం కోసం అక్కడికి అధికారులను పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని నిరుపేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు. కుల గణన సర్వే నిమిత్తం వివిధ జిల్లాల్లో అధికారుల నిమాయకం కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన కార్యక్రమానికి తహశీల్దార్లు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కుల గణన కార్యక్రమం గురించి ప్రతి ఇంటికీ వాలంటీర్ ద్వారా సమాచారం అందిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కులాల లెక్కలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. వాలంటీర్లను ఈ కులగణనలో భాగస్వామ్యం చేయడం లేదు.. కేవలం సమాచారం చేరవేయడానికి మాత్రమే సాయం తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa