ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టారని.. ఈ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశామన్నారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలన్నారు.
ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తామన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామని.. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశామన్నారు. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయని.. డీబీటీ నాన్డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామన్నారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని.. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదని.. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా అని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంత మామక వెన్నుపోటు పొడిచారని.. ప్రజలకు వెన్నుపోట పొడవకుండా ఉంటారా అన్నారు.
చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడారన్నారు. మానత్వం లేని మనిషి చంద్రబాబు.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తాను మారానని చంద్రబాబు చెబుతారన్నారు. ఎన్ని ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తే చంద్రబాబులో మానవత్వం వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల కోసం కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చంద్రబాబు హమీలు ఇస్తారన్నారు. మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం తనకు ఉందని.. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామన్నారు. తాను పొత్తులను నమ్ముకోలేదని.. తన ధైర్యం ప్రజలు.. అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదన్నారు.
చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారన్నారు. చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం చంద్రబాబుకు పట్టదని.. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారని.. ఆయన మనుషులు చాలామంది ఆయా వ్యవస్థల్లో ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa