కులగణన సర్వే సున్నితమైన అంశమని, అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా జేసీ అపరాజిత సింగ్ అన్నారు. కులగణనలో ఆర్థిక, సామాజిక, విద్య, జీవనోపాధి, జనాభా సమతుల్యతలపై సర్వే చేయాల్సి ఉందన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు కులగణన కార్యక్రమం జరగుతుందన్నారు. తహసీల్ధార్లు నోడల్ అధికారులుగా ఉండి నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. కులగణనకోసం ఇంటింటీకి వెళ్లిన సమయంలో బయోమెట్రిక్, ఐరిస్, ఈకేవైసీ వంటివి ఉపయోగించాలన్నారు. కులగణన చేసేవారు ఒకే మొబైల్ఫోను ఉపయోగించి. పూర్తి వివరాలను యా్పలో పొందుపరచాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో వారంరోజుల్లోగా ప్రకియ్రను పూర్తిచేయాల్సి ఉందన్నారు. సర్వే పూర్తయిన తరువాత సచివాలయాల పరిధిలోని 10 గృహాల వద్దకు అధికారులు వెళ్లి సంబంధిత కుటుంబాల వివరాలు సక్రమంగా ఉన్నదీ లేనిది పరిశీలన చేస్తారని తెలిపారు. సర్వే సమయంలో ఎలాంటి ధృవీకరణపత్రాలను అడగవద్దని ఆమె అన్నారు. వ్యక్తిపేరు, వయసు, పురుషులా, మహిళలా, భూమి వివరాలు, వృత్తి, విద్యార్హతలు, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, నివాసం ఉండే ఇంటికి తాగునీటి సదుపాయం ఉందా లేదా, మరుగుదొడ్డి సౌకర్యం, వంటగ్యాస్ కనెక్షన్ ఉందా, లేదా, మొత్తంగా 20 అంశాలపై వివరాలు సేకరించాలన్నారు. ఈ అంశంపై వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి డివిజన్, మండలస్థాయిలో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. డీఆర్వో పెద్దిరోజా, సాంఘిక సంక్షేమశాఖ అధికారి షేక్ షాహిద్బాబు, గిరిజన సంక్షేమశాఖ అధికార ఫణిదూర్జటి, ఆర్డీవోలు ఎం.వాణి, రాజు, పద్మావతి, డీఎల్డీవో కేవీ సుబ్బారావు, తహసీల్దార్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa