విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ఈనెల 23న నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల విక్రయం పూర్తి కాగా.. నేటి నుంచి ఆఫ్లైన్లో అమ్ముతున్నారు. ఈ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించి రూ.600, 1,500, 2,000, 3,000, 3,50, 6,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. టికెట్ల కోసం కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల దగ్గరే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలోకి చేరుకుని టికెట్లకు పోటీపడ్డారు. ఈ అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుండగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆన్ లైన్లో చాలా వరకు టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కోసం అభిమానులు బారులుతీరారు. చాలా రోజుల తర్వాత విశాఖలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం ఇలా ఎగబడ్డారు. మొత్తానికి విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వరల్డ్ కప్ పూర్తికాగానే ఇండియా ఆస్ట్రేలియాతో మూడు టీ-20లు ఆడుతోంది. ఈ నెల 23న విశాఖలో మ్యాచ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa