ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిరంలో అర్చక పోస్టులకు ప్రకటన.. 3 వేల మంది దరఖాస్తు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 11:39 PM

అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మందిరంలో అర్చకుల ఉద్యోగాలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 3000 మంది దరఖాస్తు చేసుకోగా.. మెరిట్ ప్రాతిపదికన 200 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరికి అయోధ్యలోని కరసేవకపురంలో వృందావన్ ఆలయ పండితుడు జయకాంత్ మిశ్రా, అయోధ్యకు చెందిన మహంతులు మిథిలేశ్ నందిని శరణ్, సత్యనారాయణ్ దాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యులు కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.


శిక్షణకు హాజరయ్యే ఎంపికకాని, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని, భవిష్యత్తులో సృష్టించే అర్చకుల పోస్టులకు పిలిచే అవకాశం ఉంటుందని రామమందిర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు పలు పూజా విధానాల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. సంధ్యావందనం విధానం, మంత్రాలు, ప్రత్యేక మంత్రాలతో పాటు కర్మకాండ, రాముడి ఆరాధన తదితర అంశాల గురించి అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు దేవ్ గిరి చెప్పారు.


ఇక, మొత్తం 20 అభ్యర్థులను చివరకు ఎంపిక చేసి.. ఆరు నెలల పాటు రెసిడెన్షియల్ ట్రెయినింగ్ ఇస్తారు. అనంతరం రామజన్మభూమి ప్రాంగణంలోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా నియమిస్తారు. ఎంపికైన 20 మంది అభ్యర్థులు విశ్వహిందూ పరిషత్ (VHP)తో సహా అనేక హిందూ సంస్థల కార్యాలయాలను కలిగి ఉన్న కరసేవకపురంలో ఆరు నెలల శిక్షణను నిర్వహిస్తారు. అగ్రశ్రేణి పండితులు తయారుచేసిన మతపరమైన సిలబస్ ఆధారంగా శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఒక్కొక్కరికి నెలవారీ స్టైఫండ్‌ కింద రూ.2,000 కూడా అందజేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa