ఉత్తర ప్రాంతంలో నమోదువుతోన్న కొత్తరకం న్యూమోనియా కేసుల్లో అసాధారణ లేదా కొత్త వ్యాధికారక కారకాలు కనుగొనలేదని చైనా వివరాణాత్మక సమాచారం ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గురువారం తెలిపింది. అక్టోబర్ మధ్య నుంచి ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను చూపుతున్న చైనా నిఘా వ్యవస్థల డేటాను డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షిస్తోంది. మరింత డేటా కోసం బీజింగ్ను కోరినట్టు బుధవారం ప్రకటించింది. కానీ, చైనా ప్రభుత్వం దీనిపై ఎటువంటి బహిరంగ వ్యాఖ్య చేయలేదు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని పిల్లల ఆస్పత్రి, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
‘బీజింగ్, లియోనింగ్తో సహా అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారక లేదా అసాధారణమైన క్లినికల్ ప్రెజెంటేషన్లను గుర్తించలేదని చైనా అధికారులు సలహా ఇచ్చారు.. కానీ, బహుళ వ్యాధికారక కారకాల వల్ల శ్వాసకోశ వ్యాధులలో పైన పేర్కొన్న సాధారణ పెరుగుదల మాత్రమే ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. శ్వాసకోశ అనారోగ్యం పెరగడం వల్ల ఆసుపత్రి సామర్థ్యం మించి రోగుల భారం పడలేదని వారు పేర్కొన్నారని చెప్పింది.
‘డబ్ల్యూహెచ్ఓ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.. చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.. WHO హామీ మేరకు కొత్త డేటా అందించడం కొనసాగిస్తుంది’ అని వివరించింది. చైనాలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. వీటిలో ఫ్లూ, కోవిడ్-19,ఇతర శ్వాసకోశ వ్యాధికారక వైరస్ల నిరోధానికి సిఫార్సు చేసిన టీకాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచడం; బాధితులు ఇంట్లో ఉండటం; పరీక్షలు, అవసరమైన వైద్య సంరక్షణ పొందడం; మాస్క్లు ధరించడం వంటివి ఉన్నాయి. అయితే చైనాకు వెళ్లే ప్రయాణికుల తాము ఎటువంటి నిర్దిష్ట చర్యలను సిఫారసు చేయడం లేద డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
కాగా, నాలుగేళ్ల కిందట మొదలైన కోవిడ్-19 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఈ కొత్తరకం న్యుమోనియా కేసులు పెరగడం యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది మరో మహమ్మారిగా మారుతుందేమోనని భయపడుతోంది. పెద్ద సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడి, ఆస్పత్రుల్లో చేరడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. అక్టోబరు మధ్య నుంచి ఈ కేసుల్లో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు చైనా సీడీసీ అధికారులు నివేదికలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa