ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎన్ఎంయూఏ కార్యదర్శి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా, సాలూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం విరామ సమయంలో న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించకపోతే తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. అలానే పాలకొండ స్థానిక ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మన్యం జిల్లా ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు మజ్జి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పీఎల్ రావు, కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో యాజమాన్యం అవలంభిస్తున్న చర్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa