ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. రోజుకో కొత్త రూట్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. అమాయకుల్ని టార్గెట్ చేసి అకౌంట్లో డబ్బుల్ని మాయం చేస్తున్నారు. తాజాగా కొత్త వాషింగ్ మిషన్ పనిచేయకపోవడంతో.. దాని స్థానంలో కొత్తది పంపుతామని డబ్బులు ఖాతాల్లోకి వేయించుకుని మోసం చేసిన ఘటన కలకలంరేపింది. అనంతపురానికి చెందిన ఆదినారాయణ ప్రైవేటు ఉద్యోగి.. ఆయన ఐదు నెలల క్రితం స్థానికంగా ఓ షాపులో వాషింగ్ మెషిన్ రూ.36 వేలతో కొనుగోలు చేశాడు. రెండు నెలలు వినియోగించిన తర్వాత మిషన్ మరమ్మతులకు గురైంది. వినియోగదారుడు ఆ కంపెనీకి చెందిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఓ మెకానిక్ వెళ్లి మిషన్ పరిశీలించి వెళ్లాడు. ఇది జరిగిన నెల తర్వాత కంపెనీ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరెడ్డి (ఫోన్ 88977 58057) పేరుతో ఓ అపరిచిత వ్యక్తి ఆదినారాయణకు ఫోన్ చేశాడు.
వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందని ఆరా తీసి.. ఓ నకిలీ మెకానిక్ను పంపించాడు. వాషింగ్ మెషిన్ డ్రమ్ములో సమస్య ఉందని.. అందువల్లనే మెషిన్ వైబ్రేట్ అవుతోందని మెకానిక్ చెప్పాడు. మళ్లీ ఫోన్ ద్వారా టచ్లోకి వచ్చిన సైబర్ నేరగాడు పాతమిషన్ స్థానంలో మరిన్ని సౌకర్యాలు ఉన్న కొత్తది పంపుతానని.. అందుకు అదనంగా రూ.4,400లు ఖర్చవుతుందని మాయ మాటలు చెప్పాడు. మోసగాడి మాటలు నమ్మిన ఆదినారాయణ.. అపరిచిత వ్యక్తి పంపిన ఫోన్ పే నంబరుకు 3 దఫాలుగా అడిగిన మొత్తం పంపించాడు. ఆ తర్వాత ఎన్ని రోజులైనా కొత్త వాషింగ్ మెషిన్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. తనకు ఫోన్ చేసిన నంబర్ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. అయితే డబ్బు తీసుకున్న వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించిన ఆదినారాయణ.. సదరు కంపెనీ వారికి నేరుగా ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు ఆదినారాయణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa