ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించిన సామాజికంగా విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనంగా అభ్యర్థులను నగదు ప్రోత్సాహం అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి రూ. 50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందిస్తారు. 2023 పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే అర్హులు. అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్లో ఆన్లైనలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 19 లోగా పోస్టల్ కూడా దరఖాస్తులు పంపించవచ్చన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏటా యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏపీ నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://jnanabhumi.ap.gov.in/ వెబ్ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa